మంత్రి బొత్స కాళ్లకు ఐఏఎస్ అధికారి మొక్కడంపై వర్ల రామయ్య స్పందన

  • విజయనగరం జిల్లాలో ఘటన
  • మంత్రి బొత్స కాళ్లకు మొక్కిన జేసీ
  • నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన వైనం
  • ఐఏఎస్ అధికారి తీరుపై విమర్శలు
నూతన సంవత్సరాది సందర్భంగా ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కాళ్లకు విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ కిశోర్ కుమార్ మొక్కడంపై విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఈ అంశంపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య స్పందించారు. ఓ ఐఏఎస్ అధికారి ఒక రాజకీయనేత కాళ్లకు నమస్కరించడం అవమానకరం అని పేర్కొన్నారు.

సదరు ఐఏఎస్ అధికారి చర్య చూస్తుంటే జిల్లా యంత్రాంగం మొత్తం మంత్రికి దాసోహం అంటోందని భావించాలా? ఈ చర్యను ఐఏఎస్ అధికారుల సంఘం తక్షణమే ఖండించాలి కదా? వాళ్లు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? అంటూ వర్ల రామయ్య ప్రశ్నించారు.

Varla Ramaiah
JC Kishore Kumar
IAS
Botsa Satyanarayana
Vijayanagaram District
YSRCP
Andhra Pradesh

More Telugu News